వరంగల్ : హనుమకొండ(Hanumakonda) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ కాళ్లపై నుంచి ఆర్టీసీ బస్సు( RTC bus) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ రెండు కాళ్లు విరిగిపోయాయి(Woman injury). ఈ విషాదకర సంఘటన శుక్రవారం హనుమకొండ బస్టాండ్లో చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన మహిళ హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన కావటి రాజక్క (48)గా గుర్తించారు.
గుర్తించిన స్థానికులు వెంటనే ఆమెను దవాఖానకు తరలించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.