హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆసక్తిసర పరిణామం చోటుచేసుకుంది. మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మీడియా పా యింట్ వద్ద మాట్లాడే అవకాశం కోసం చూస్తుండగా, అదే సమయంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మీడియా పాయింట్కు వచ్చారు. ఆయన రాకను చూసి యెన్నం ‘మొన్ననే పెండ్లయ్యింది.. అసెంబ్లీకి ఎందుకొచ్చినవన్న’ అంటూ వ్యాఖ్యానించారు. మల్లారెడ్డి నవ్వుతూ వెళ్లిపోయారు. మల్లారెడ్డి ఇటీవలే 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకొన్నారు.