నిర్మల్ అర్బన్, మే 15: నిర్మల్ జిల్లా కేంద్రానికి 15 కిలో మీటర్ల దూరంలోని కొండలు, లోయల మధ్య వెలిసిన కదిలె పాపహరేశ్వర శివాలయం ప్రసిద్ధి చెందినది. ఆలయ ప్రాంగణంలో సోమవారం 11వ శతాబ్దపు నాట్య శివుని విగ్రహాన్ని గుర్తించినట్టు చరిత్రకారుడు తుమ్మల దేవరావ్ తెలిపారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాల్లో అరుదుగా శివుని నాట్య విగ్రహాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
శివుని నృత్యాలు లాస్యం, తాండవమని రెండు రకాలుగా ఉంటాయని, ఇందులో శివుని నృత్యం తాండవ భంగిమలో ఉన్నదని అన్నారు. అద్భుతమైన, మనోహరమైన ఈ శివుని నాట్య విగ్రహం (నటరాజ) కదిలె ఆలయ ప్రాంగణంలో ఉండటం విశేషమని తెలిపారు.