Telangana | తెలంగాణ వస్తే ఏమొస్తది?
కొత్త గ్రామపంచాయతీలు వస్తయి.. కొత్త పాలనా భవనాలు వస్తయి..
కొత్త పంచాయతీరాజ్ చట్టంతో చేసేదేంటీ?
మారుమూల గ్రామాల్లోనూ అండర్గ్రౌండ్ డ్రైనేజీ వస్తది
30 రోజుల ప్రణాళికతో ఒరిగేదేంటీ..
అపరిశుభ్రత పరారైతది
గ్రామజ్యోతితో అయిందేంటీ?
తళతళ మెరిసే రోడ్లు వచ్చినయి.. పల్లె ప్రకృతి వనాలొచ్చినయి.. వైకుంఠధామాలొచ్చినయి.
మన ఊరు-మన బడితోని ఏమైతది?
మన గల్లీ బడులు కార్పొరేట్ ఇస్కూల్లు అయితయి
కొత్త కార్యదర్శులు ఏం జేస్తరు?
గ్రామాలు డిజిటల్ మయం అవుతయి.. పట్టణాల్లోనే లేని సీసీ కెమెరాలు వస్తయి..గ్రామాన్ని మానిటర్ చేస్తరు..
కేసీఆర్తోని ఏం అయితది?
గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాకారమైతది.. బలిజపల్లిలాంటి గ్రామాలు తయారైతయి..
తెలంగాణ సర్కార్ ఏం జేసినా తప్పుబట్టే ప్రతిపక్షాలకు సమాధానం.. బలిజపల్లి. తెలంగాణ ఆదర్శ పల్లెలకు నిదర్శనం బలిజపల్లి. ప్రగతికి కేరాఫ్ బలిజపల్లి. పారిశుద్ధ్య నిర్వహణ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, తళతళా మెరిసే రోడ్లు, కొత్త పంచాయతీ భవనం, పల్లె ప్రకృతివనం, వెల్నెస్ సెంటర్, కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే పాఠశాల, వైకుంఠధామం.. ఇలా ఒక్కటేమిటీ.. సకల సదుపాయాలకు నిలయం బలిజపల్లి. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం, సీఎం కేసీఆర్ స్వప్నం గ్రామజ్యోతికి నిదర్శనంగా నిలుస్తున్నది వనపర్తి జిల్లా ఘనపురం మండలంలోని బలిజపల్లి గ్రామం. సీఎం కేసీఆర్ నేతృత్వంలో స్వరాష్ట్రంలో రూపురేఖలు మారిపోయిన పల్లెలపై తాజాగా తెలంగాణ వికాస సమితి బృందం అధ్యయనం చేసింది. ఆ విశేషాలను ‘నమస్తే’తో పంచుకున్నది.
సీఎం కేసీఆర్ సంకల్పం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీ రాజ్ చట్టం-2018 గ్రామాల రూపురేఖలనే మార్చేసింది. గతంలో ఎన్నడూ ఊహించని అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో జరిగాయి. పచ్చదనం, పారిశుధ్యం, గ్రామ పంచాయతీ భవనాలు, వైకుంఠ ధామాలు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంతో పాటు అనేక ప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి. రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో పనులు పురోగతి దశలో ఉన్నాయి. వనపర్తి జిల్లా ఘనపురం మండలంలోని బలిజపల్లి ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. తెలంగాణ వికాస సమితి ఈ గ్రామంలో నిర్వహించిన క్షేత్రస్థాయి అధ్యయనంలో పంచాయతీరాజ్ చట్టంతో వచ్చిన ఫలితాలు, గ్రామాభివృద్ధికి సంబంధించిన అనేక విశేషాలు వెలుగులోకి వచ్చాయి.
తెలంగాణ పల్లెల్లో జరిగిన అభివృద్ధి ప్రత్యక్షంగా పరిశీలించేందుకు తెలంగాణ వికాస సమితి బృందం వనపర్తి జిల్లా బలిజపల్లి గ్రామానికి వెళ్లింది. ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ రంగాల అభివృద్ధిని ప్రత్యక్షంగా పరిశీలించి ఓ నివేదిక రూపొందించింది. ఈ పర్యటనలో బృందం సభ్యులు ఏ శ్రీనివాస్, విజయానంద్, ఆసరి రాజు, వీర్రాజు, ప్రభాకర్, సుబ్బన్న, భాసర్ రావు, వీరయ్య, వెంకటయ్య, బలరాం తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష పరిశీలన ద్వారా గ్రామాభివృద్ధిని అధ్యయనం చేశారు. వారు పరిశీలించిన విషయాలు, గ్రామస్తులు తమతో పంచుకున్నఅభిప్రాయాలను వెల్లడించారు.
పల్లెలు ప్రగతిపథంలో నడవాలంటే ప్రభుత్వ పాలనా విధానాలు, సీఎం సంకల్పంతో పాటు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజల సహకారం ఎంతో అవసరం. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టం-2018 సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి విధులు, బాధ్యతలను పునర్ నిర్వచించింది. వీటిని సద్వినియోగం చేసుకున్నఅనేక గ్రామాలు అభివృద్ధి కేంద్రాలుగా మారాయి. గ్రామీణాభివృద్ధి గురించి మాట్లాడుకోవడం, వాటి కోసం ప్రణాళికలు రూపొందించుకోవడం, పథకాలు ప్రారంభించడంతోనే సరిపోదు. సర్పంచ్, కార్యదర్శి సమన్వయంతో సాగితేనే ఆ ఫలాలు ప్రజలకు అందుతాయనేది వారి పరిశీలనలో తేలింది. ఈ పర్యటన సందర్భంగా గ్రామ సర్పంచ్ డాక్టర్ జయంతి తాను గ్రామాభివృద్ధి కోసం రూపొందించుకున్నప్రణాళికలు, వాటి అమలు కోసం చేసిన కృషిని వివరించారు.
30 రోజుల ప్రణాళికతో సమగ్రాభివృద్ధి
పంచాయతీ కార్యాలయ నిర్మాణం
ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శిని నియమించింది. వారు చేయాల్సిన విధుల గురించి చట్టంలోనే స్పష్టంగా పేరొన్నది. గతంలో ఆ ఊరి పంచాయతీ కార్యాలయం చిన్నగా ఉండేది. గ్రామసభ పెట్టుకోవాలంటే అందుకవసరమైన సౌకర్యాలు లేక గుడి దగ్గర కూర్చునేవారు. దీంతో అంతా ఒకచోట కూర్చుని మాట్లాడుకుని, పని చేసుకునేలా అన్ని సౌకర్యాలతో కొత్త పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించారు. గ్రామసభ నిర్వహించుకోవడానికి అనుగుణంగా షెడ్డు కట్టారు. మహిళలు ప్రత్యేకంగా సమావేశం కావడానికి పైన ఒక హాల్ ఏర్పాటు చేశారు. చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి కార్యాలయం ఎదుట, చుట్టుపకల పూలు, పండ్ల మొకలు నాటారు. ఇప్పుడు ఆ పరిసర ప్రాంతమంతా పచ్చగా, పరిశుభ్రంగా మారింది. జూనియర్ గ్రామపంచాయతీ సెక్రటరీలను నియమించి ప్రభుత్వం వారికి విశిష్ట అధికారాలను ఇవ్వడంతో సర్పంచ్ల పని సులభమైంది. న్యాయంగా ప్రజలకు, గ్రామానికి సేవ చేయాలనే దృక్పథం కొత్తగా ఉద్యోగంలో చేరిన యువకుల్లో ఉంటుంది. కార్యదర్శితో కలిసి సర్పంచ్ అన్ని పనులను ఒకదాని తర్వాత మరొకటి పూర్తి చేశారు.
అండర్గ్రౌండ్ డ్రైనేజీ పూర్తైన మొదటి గ్రామం
మన ఊరు-మన బడితో మారిన పాఠశాల స్వరూపం
గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 450 మంది పిల్లలున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ప్రహరీ నిర్మించారు. ప్రాథమిక పాఠశాలలో తాగునీరు, మధ్యాహ్న భోజనం వండేందుకు వసతి కల్పించారు. ఎంపీటీసీ నిధులతో అసంపూర్తిగా ఉన్న టాయిలెట్లను పూర్తిచేశారు. పాఠశాల ఎదుట డయాస్ నిర్మాణం, ఆట స్థలాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని దాతలు సత్యశీలారెడ్డి, రవీందర్ రెడ్డి అందించారు. రైతువేదిక, వైకుంఠధామం, ప్రభుత్వ ఆఫీసుల ప్రాంగణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామంలోని సబ్ సెంటర్ను అప్గ్రేడ్ చేయించి వెల్నెస్ సెంటర్గా మార్చారు. అకడ రోజూ ఎంబీబీఎస్ డాక్టర్ వైద్యసేవలు అందిస్తున్నారు. ఊరు బాగుపడాలని ఉత్త మాటలు చెప్పినంత మాత్రాన ఎలాంటి మార్పూ రాదు. పాలకుల పాలనా విధానాలు, దృఢ సంకల్పం, సర్పంచ్ , కార్యదర్శుల కమిట్మెంట్, గ్రామస్తుల సహకారం ఉంటే ఐదేండ్లలో ఎలాంటి మార్పు సాధ్యమవుతుందో బలిజపల్లి గ్రామం నిరూపించింది. ఐదేండ్ల కిందట అకడ పరిస్థితులు ఎలా ఉండేవో, ప్రస్తుతం ఎలా ఉన్నదో అకడికి వెళ్లిన తెలంగాణ వికాస సమితి రాష్ట్ర బృందానికి ఆ గ్రామస్తుల అనుభవాల ద్వారా తెలిసింది. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం బలిజపల్లి బాటలోనే రాష్ట్రంలోని అనేక గ్రామ పంచాయతీల రూపురేఖలు మారిపోయాయి. తెలంగాణ వస్తే ఏమొస్తుందనే ప్రశ్నలకు రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని చూస్తే సమాధానం దొరుకుతుంది.
-కిశోర్ శుక్లా