Tenth Exams | వికారాబాద్ : వికారాబాద్ జిల్లా( Vikarabad Dist )లో పదో తరగతి ప్రశ్నాపత్రం( tenth Question paper ) బయటకు వచ్చిన ఘటనపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్కు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రశ్నాపత్రాన్ని బయటకు పంపిన ఉపాధ్యాయుడు బందప్ప, మరో ఇన్విజిలేటర్ సమ్మప్ప, చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గోపాల్ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ నలుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రకటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణ రెడ్డి( Collector Narayana Reddy ) మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం తెలుగు పరీక్ష( Telugu Exam ) ప్రారంభమైన ఏడు నిమిషాల్లోనే ప్రశ్నాపత్రం బయటకు వచ్చింది. తాండూరు( Tanduru )లోని ప్రభుత్వ పాఠశాల-1 నుంచి బయటకు వచ్చినట్లు నిర్ధారించామని తెలిపారు. ఆ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు బందెప్ప వాట్సాప్ నుంచి ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు నిర్ధారించినట్లు పేర్కొన్నారు. ఆ ప్రశ్నాపత్రాన్ని ఓ ప్రయివేటు పాఠశాలలో పని చేస్తున్న టీచర్కు బందెప్ప పంపినట్లు పోలీసులు నిర్ధారించినట్లు పేర్కొన్నారు.