మెదక్ : కాంగ్రెస్ మార్క్ రాజకీయాలపై అప్పుడే ఆ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్సీ(MLC ticket) అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అద్దంకి దయాకర్(Addanaki Dayakar)కు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుకోవడంతో అద్దంకి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
దయాకర్కు జరిగిన అన్యాయంపై జాతీయ మాల మహానాడు(Mala mahanadu) కార్యకర్తలు మెదక్ జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు. రాందాస్ చౌరస్తా వద్ద సెల్ టవర్ ఎక్కి ఇద్దరు కార్యకర్తలు నిరసన తెలిపారు. అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ పట్టణ మాల మహానాడు అధ్యక్షుడు బత్తుల ప్రసాద్, జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.