హైదరాబాద్ : అమ్మా..మాస్క్ మస్ట్..ఇదిగో మాస్క్ పెట్టుకోండి. ఇప్పుడే తీసాం సార్..ఎప్పుడూ తీయవద్దమ్మా..మాస్క్ మస్ట్గా పెట్టుకోవాలి. కరోనా కట్టడికి మాస్క్ తప్పని సరిగా ధరించాలి. ఏ మాత్రం అలక్ష్యం వద్దు. మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే మాస్క్ ధరించాలి అంటూ మాస్కులు లేని వారికి తన వద్ద ఉన్న మాస్కులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు.
ఈ సంఘటన హైదరాబాద్ నగరం చైతన్య పురిలో ఓ ప్రైవేటు దవాఖాన ప్రారంభోత్సవం సందర్భంగా జరిగింది. మంత్రి హరీశ్ రావు కారు దిగినప్పటి నుంచి మాస్క్ లేని వారు కనిపిస్తే తన వద్ద ఉన్న మాస్క్ లు అందజేశారు. దీంతో పాటు అక్కడ ఉన్న వారితో సంభాషించారు.
రెండు డోసుల టీకా వేసుకున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రేపటి నుంచి అరవై ఏండ్లు దాటిన వారికి బూస్టర్ డోస్ ఇస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఇలా ఓ మంత్రి తమ యోగక్షేమాలు అడగడంతో పాటు, కరోనా జాగ్రత్తలు చెప్పడంతో వారంతా ఈ ఊహించని పరిణామానికి ఆనందం వ్యక్తుం చేశారు.