హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): దేశ అంతర్గత రక్షణలో పోలీసు వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్షా చెప్పారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం 75వ బ్యాచ్ ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం సందడిగా జరిగింది.
కేంద్ర హోంమంత్రి ముందుగా ట్రైనీ ఐపీఎస్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ భద్రతకు ఐపీఎస్ అధికారులు పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు. ఇండోర్, అవుట్డోర్ విభాగాల్లో ప్రతిభ చూపిన ట్రైనీ ఐపీఎస్లకు అమిత్షా బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం 5కే మారథాన్ను ప్రారంభించారు.