హైదరాబాద్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ) : కాలిఫోర్నియాలోని మిల్పీటస్ సిలికానాంధ్ర వర్సిటీ ప్రాంగణంలో 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఈ నెల 21, 22న నిర్వహించనున్నారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, సిలికానాంధ్ర వర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సుకు వంగూరి చిట్టెన్ రాజు అధ్యక్షత వహిస్తారు.
ఈ సందర్భంగా అక్షరానికి అందలం పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో తెలుగు రాష్ర్టాలకు చెందిన వందలాది మంది రచయితలు, కళాకారులు పాల్గొంటారు.