హైదరాబాద్: యూఎస్ కాన్సులేట్ ఐటీ కారిడార్లోని నానక్రామ్గూడలో కొత్తగా నిర్మించిన భవనంలోకి మారినట్లు హైదరాబాద్ యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లోపెజ్ సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత 14 ఏళ్లుగా బేగంపేటలోని పైగా ప్యాలెస్లో యూఎస్ కాన్సులేట్ సేవలు అందించింది. మార్చి 15 నుంచి అక్కడ సేవలను నిలిపివేసి కార్యాలయం మార్పు ప్రక్రియను చేపట్టామని, ఈ పక్రియ ఇప్పుడు పూర్తయిందని జెన్నిఫర్ తెలిపారు.
కొత్త యూఎస్ కాన్సులేట్ జనరల్ వద్ద అమెరికా జెండాను ఎగురవేశామని, ఈ రోజు ఈ అద్భుతమైన సదుపాయం సాధ్యమయ్యేలా కృషి చేసిన ప్రతి ఒకరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని జెన్నిఫర్ పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో యూఎస్-భారత్ భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు.