హైదరాబాద్ : తెలంగాణ సచివాలయానికి పేరు పెట్టిన విధంగానే పార్లమెంట్(Parliament)కు కూడా అంబేద్కర్(Ambedkar) పేరును పెట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు(Ministers ) వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్ది దయాకర్రావు డిమాండ్ చేశారు. ఈనెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ( Telangana Secretariat ) భవనాన్ని శుక్రవారం ఎలక్ట్రిక్ వాహనంలో వారు కలియ తిరిగి పరిశీలించారు. భవనం లోపల కట్టడాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు తెలంగాణ సచివాలయం దేశంలోనే గొప్ప కట్టడంగా రూపు దిద్దుకుందని పేర్కొన్నారు. సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీమయని వెల్లడించారు.