హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సరార్ కావాలనే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేదర్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించలేదని టీఎస్ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ ధ్వజమెత్తారు. అంబేద్కర్ అంటే కాంగ్రెస్కు చిన్నచూపేందుకని, అధికారికంగా జయంతిని ఎందుకు జరుపదని నిలదీశారు.
అంబేదర్ జయంతి ఉత్సవాల్లో నిర్లక్ష్యం వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లోయర్ ట్యాంక్లోని అంబేదర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రజల కోసం కనీస వసతులు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ సారే అంబేదర్ జయంతి ఉత్సవాల నిర్వహణకు కమిటీ ఏర్పాటు చేయలేదని, ఇందుకు రేవంత్రెడ్డి సర్కార్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
గతంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని మండల, జిల్లాకేంద్రాల్లో అంబేదర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగేవని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఎలాంటి కమిటీ వేయలేదు… ఉత్సవాలూ నిర్వహించలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎత్తయిన 125 అడుగుల అంబేదర్ విగ్రహం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ సరార్ కనీసం ఆ విగ్రహానికి కనీసం పూలమాల కూడా వేయకపోవడం దారుణమని ధ్వజమెత్తారు.