హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టిన సీఎం కేసీఆర్కు తెలంగాణ ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచంద్రనాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దళిత, గిరిజనులకు దక్కిన గౌరవమని అన్నారు.
దేశంలోనే దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలకు సంపూర్ణమైన గౌరవం, సామాజిక న్యాయం కల్పించిన చరిత్ర కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. విగ్రహావిష్కరణకు గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు