హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ)/కవాడిగూడ: హైదరాబాద్ మహానగరానికి బొడ్రాయిగా డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహం నిలువనుందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ అన్నారు. భారీ అంబేదర్ విగ్రహం నిర్మించడంతో పాటు.. తెలంగాణ పరిపాలన సౌధం సచివాలయానికి బీఆర్ అంబేదర్ పేరు పెట్టినందుకు అన్ని కులసంఘాల నేతలతో కలిసి ట్యాంక్బండ్ అంబేదర్ విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి 500 కిలోల గులాబీలతో పూలాభిషేకం చేశారు. రాజీవ్ సాగర్ మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేదర్ రచించిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని తెలిపారు.
కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు రాంచందర్మాల, టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ, జై భీమ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు పీ బల్వంత్రావుమాల, టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ రమేశ్మాదిగ, తెలంగాణ స్టేట్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కే గిరిందర్మాల, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జీ చెన్నయ్య, జాతీయ మాలల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కరణం కిషన్, దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు జన్ను కనకరాజు, దళిత నేతలు రావుల విజయ్కుమార్, గంధం రాములు, గంప రాజేశ్, బూడాల బాబురావు, శేఖర్, శ్రీకాంత్, డేవిడ్ జంపాల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
యువకుల పాదయాత్ర
దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని తిలకించేందుకు నలుగురు యువకులు పాదయాత్రగా తరలివస్తున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ నుంచి ట్యాంక్బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు సుమారు 55 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తున్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రచారం చేయడంతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా యువకులు కానుకుంట సుదర్శన్, లంబ రాజు యాదవ్, సుముద్రం యాదగిరి, ఐలేష్ ముదిరాజ్ ఈ పాదయాత్ర చేపట్టారు.