హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): కరెన్సీ నోట్లపై రాజ్యాంగ నిర్మాత అంబేదర్ ఫొటోను ముద్రించాలని, ఈ పార్లమెంట్ సవేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జెర్రిపోతుల పరుశురామ్ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శుక్రవారం నిర్వహించిన మహాధర్నాకు ఆర్ కృష్ణయ్య హాజరై ప్రసంగించారు. ఈ అంశంపై ఇప్పటికే ఉప రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్ను కలిసి విన్నవించామని వివరించారు. పార్లమెంట్లో సైతం కొట్లాడతామని పేర్కొన్నారు. ధర్నాలో సాధన సమితి నేతలు గుజ్జ కృష్ణ, బొల్లి స్వామి, కంఠ వేణు, ఉదయభాసర్, ధనశేఖర్, గురుమూర్తి, బానోతు రవి, ఆశీర్వాదం, నర్సింహులు, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.