హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): కరెన్సీ నోట్లపై అంబేదర్ ఫొటో ముద్రించాలని, దీనిపై ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ ఆర్ కృష్ణయ్య, కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరుశురామ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం వారు పార్లమెంట్లో స్పీకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం పరుశురామ్ మాట్లాడుతూ.. అంబేదర్ ఫొటో ముద్రించాలనే డిమాండ్తో చేపట్టిన ప్రజాపోరు రథయాత్ర ఫిబ్రవరి 1న విశాఖపట్నంలో ప్రారంభమై ఢిల్లీకి చేరుకున్నదని వివరించారు.