హైదరాబాద్ : ప్రముఖ ఇంటర్నేషన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ హైదరాబాద్లో ఇవాళ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఏడబ్ల్యూఎస్ సెంటర్ను స్వాగతించారు. దేశంలోనే రెండో అతిపెద్ద అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీజియన్ సెంటర్ను ప్రారంభించినట్లు అమెజాన్ ఆసియా ఫసిఫిక్ రీజియన్ ప్రకటించింది.
ఈ కొత్త సెంటర్ 2030 నాటికి సుమారు రూ. 36,300 కోట్ల పెట్టుబడుటు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడులతో సంవత్సరానికి సగటును 48 వేల ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది.
హైదరాబాద్లో ప్రారంభించిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ భవిష్యత్లో రూ. 36,300 కోట్ల పెట్టుబడులు పెడుతామని చెప్పిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సెంటర్ ఏర్పాటుతో దేశంలోనే ప్రగతిశీల డేటా సెంటర్ హబ్గా తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
“We welcome AWS’s commitment to invest approximately INR 36,300 crores in the AWS Region in Hyderabad, which strengthens Telangana’s position as a progressive data center hub in India,” said Minister @KTRTRS.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 22, 2022