యాదాద్రి భువనగిరి : యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నారని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. యాదాద్రీశుడికి పూజలు చేశారు. ఆలయ నిర్మాణ విశిష్టతలను అడిగి తెలుసుకున్నారు. ఆలయాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నారని ఆయన ప్రశంసించారు.