వ్యవసాయ యూనివర్సిటీ, సెప్టెంబర్ 19: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే అద్భుత ప్రగతి సాధించిందని బ్రెజిల్ ఫెడరల్ రూరల్ యూనివర్సిటీ ఆఫ్ పెర్నంబుకో వ్యవసాయ బయోడైవర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ గెరాల్డ్ యుజెనియో ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ వెంకటరమణ, ప్రధాన శాస్త్రవేత్తలతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. తొమ్మిదేండ్లలోనే నూతన వంగడాల సృష్టించడమే కాకుండా ఇతర దేశాలకు తిండి గింజలు ప్రధానంగా (వరి) ఎగుమతి చేయడంతో ప్రభుత్వ సహకారంతోపాటు విశ్వవిద్యాలయం కృషి అభినందనీయమని చెప్పారు. తెలంగాణ వ్యవసాయ వర్సిటీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
మంథని