సూర్యాపేట టౌన్: అమరుల త్యాగ ఫలమే.. నేటి స్వేచ్ఛా వాతావరణమని..దేశ స్వాతంత్య్రంలో ఎందరో వీరులు అమరులయ్యారని.. తెలంగాణ రా ష్ట్ర సాధనలోనూ ఎందరినో కోల్పోయామని.. అమరులను స్మరించుకుంటూ ముందుకు సాగడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని రాష్ట్ర విద్యు త్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర సంగ్రామం ప్రారంభమై 75 ఏండ్లు నిండిన సందర్భంగా చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్లో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఫీల్డ్ పబ్లిసిటీ నల్లగొండ యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ నెల 26 నుంచి 28 వరకు ప్రముఖ తెలుగు స్వాతంత్య్ర సమరయోదుల ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాటి స్వాతంత్య్ర పోరాట సమరంలో ఎంతో మంది తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి త్యాగం చేయడం వళ్లే నేడు స్వేఛ్చగా జీవించగలుగుతున్నామని.. ప్రతి ఒక్కరూ భారతీయుడిగా స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నామన్నారు. బ్రిటీ ష్ వారిని ఎదిరించి తెలుగు రాష్ర్టాలలోని ప్రజలు, నాయకులు ఆవిశ్రాంత పోరు చేశారని గర్తు చేశారు. భారత దేశ వ్యాప్తంగా జరిగిన స్వాతంత్య పోరాటంలో తెలుగు ప్రజలు కూడా భాగస్వాములై స్వాతంత్య్ర సాధనలో పాలు పంచుకోవడం మనందరికీ గర్వ కారణమని చెప్పారు.
తదుపరి నిజాం ప్రభువు భారతదేశంలో విలీనం కాకుండా ఉన్నప్పటికీ తగు చర్యలు తీసుకుని భారతదేశంలో కలువడం జరిగింన్నారు. స్వాతంత్రం కోసం అసువులు బాసిన అమరులందరినీ ప్రతీ భారతీయుడు తలుచుకోవడం వారికి నివాళులర్పించడం మహాయోధులను గుర్తు తెచ్చుకోవడం ఇ లాంటి ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేయడం ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ విషయమన్నారు. అనాటి త్యాగదనుల పోరాటాలను స్మరించుకుంటూ వారి బాటలో నడవాలని ప్రతివారు కూడా దేశభక్తిని చాటుకోవాలని అలాగే తెలంగాణ కోసం అమరులైన వారందరినీ కూడా స్మరించుకోవడం తెలంగాణ బిడ్డగా గర్వపడాలన్నారు.
దేశ దాశ్య సృంకలాలను చేధించిన విధంగానే తెలంగాణలో కూడా దశాబ్దాల పోరాటం సాగిందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణలో నేడు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను నేడు ప్రతీ తెలంగాణ పౌరుడు అనుభవిస్తున్నాడన్నారు. ఈ సందర్భంగా కళాకారుల ప్రద ర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మున్సి పల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జడ్పీటీ సీ జీడి భిక్షం, కోటేశ్వర రావు, గండూరి శంకర్, వాసా శ్రీశైలం పాల్గొన్నారు.