హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూహెచ్ క్యాంపస్లో ఈ నెల 22, 23 తేదీల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నారు. గ్లోబల్ అలుమ్ని పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమ ఏర్పాట్లపై జేఎన్టీయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో మాజీ డీజీపీ మహేందర్రెడ్డి, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఏ సుధాకర్, ఏ నరేంద్రరెడ్డి, జనప్రియ అధినేత రవీందర్రెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, ప్రగతి రిసార్ట్స్కి చెందిన బాల కోటేశ్వరరావు, మాజీ వీసీలు, ప్రొఫెసర్లు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. గ్లోబల్ అలుమ్నికి అన్ని ప్రాంతాల నుంచి దాదాపు 1,600 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. యూనివర్సిటీ పూర్వవిద్యార్థుల్లో మాజీ డీజీపీ మహేందర్రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు ఉన్నారు.