కరీంనగర్ కమాన్చౌరస్తా, జూన్ 1 : జేఈఈ అడ్వాన్స్డ్-2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అఖండ విజయం సాధించారని, జాతీయ స్థాయిలో ర్యాంకులు పొందారని విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. కే ప్రజ్ఞాన్ దీపక్ 75వ ర్యాంకు సాధించగా, సీహెచ్ లక్ష్మీహాసిని 400, ఎన్ రత్నప్రకాశ్ 497, బీ లిఖిత్ సాయి 785, ఎమ్ వశిష్ఠ 800, బీ స్పందన 954, కే ధనుష్ 1,294, ఎమ్ జోహన్ 1,400, పటేల్ అక్షయ 1,488, సీహెచ్ అభిరామ్ రావు 1,618, ఏ సత్యవర్ధన్ 1,678 ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ ఖ్యాతిని మరింత పెంచారని చెప్పారు.
వెయ్యిలోపు ఆరుగురు విద్యార్థులు, 2వేలలోపు 11 మంది, 3వేలలోపు 19 మంది విద్యార్థులు ర్యాంకులు కైవసం చేసుకోవడం గొప్ప విషయమని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ప్రప్రథమంగా ఐఐటీ కోచింగ్ అందించి, అనేక మంది విద్యార్థులు ప్రతిష్టాత్మక ఐఐటీల్లో సీట్లు సాధించేలా తీర్చిదిద్దిన ఏకైక విద్యాసంస్థ అల్ఫోర్స్ అని స్పష్టం చేశారు.