కేపీహెచ్బీ కాలనీ(హైదరాబాద్) : అడవి బిడ్డలకు స్వాతంత్ర కాంక్షను రగిలించి, ఉద్యమ స్ఫూర్తితో ప్రజల బానిస సంకెళ్లను విముక్తి చేయడానికి అల్లూరి సీతారామరాజు(Alluri Sitaramaraju) చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని(Struggle Inspiring) కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Mla Madhavaram Krishna rao) అన్నారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆదివారం కూకట్పల్లి జాతీయ రహదారిపై, కేపీహెచ్బీ కాలనీలోని అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులను(British Rulers) ఎదురించి ప్రజల కోసం ప్రాణాలు వదిలిన మహనీయుడని కొనియాడారు. బ్రిటిష్ పాలకులను తరిమికొట్టి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేందుకు ఆయన చేసిన పోరాటాలు గొప్పదన్నారు. ఆ మహనీయుడి స్ఫూర్తితో ముందుకు సాగుతూ ఆయన ఆశయాలను సాధించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
క్షత్రియుల సంక్షేమానికి ప్రభుత్వ కృషి చేస్తుందన్నారు. కేపీహెచ్బీ కాలనీలో కోటీ రూపాయలతో అల్లూరి సీతారామరాజు పార్కును(Park) అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్రావు, మాజీ కార్పొరేటర్ బాబురావు, శ్యామలరాజు తదితరులు ఉన్నారు.