హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలోని ప్రధానోపాధ్యాయులకు ఏజీ జీపీఎఫ్ ఖాతాలను అనుమతించాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం (టీఎస్జీహెచ్ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది. హెచ్ఎం పోస్టు మల్టిజోన్ కావడంతో జిల్లాలు మారినప్పుడల్లా పీఎఫ్ చెల్లింపులో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. కావున జడ్పీ జీపీఎఫ్కు బదులుగా ఏజీ జీపీఎఫ్ను అమలుచేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ రాజభాను చంద్రప్రకాశ్, ప్రధానకార్యదర్శి ఆర్ రాజుగంగారెడ్డి, కోశాధికారి బీ తుకారాంలు విజ్ఞప్తిచేశారు.