హైదరాబాద్/కాశీబుగ్గ, ఫిబ్రవరి 4 : రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మారెట్లో ఎర్ర బంగారం (ఎండుమిర్చి)ధరలు రోజురోజుకూ ఎగబాగుతున్నాయి. వరంగల్లోని ఏనుమాముల, హైదరాబాద్లోని మలక్పేట, నిజామాబాద్ వంటి వ్యవసాయ మారెట్ యార్డుల్లో మిర్చి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో బుధవారం వండర్హాట్ రకం మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. గత నాలుగేండ్లలో అత్యధికంగా క్వింటాల్ రూ.37, 100 ధర పలికినట్టు అధికారులు తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం నీలంపల్లికి చెందిన రైతు ఆర్ వినోద్ ఎనుమాముల మార్కెట్కు 80 బస్తాల వండర్హాట్ మిర్చి తీసుకొచ్చాడు. కీర్తన అడ్తి ద్వారా భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఖరీదు వ్యాపారి అత్యధిక ధరకు కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. క్వింటాల్ అత్యధికంగా రూ.37, 100, మధ్యరకానికి రూ.30వేలు, కనిష్ఠంగా రూ.15 వేలు ధర పలికినట్టు అధికారులు తెలిపారు. ధరలు ఎక్కువగా పలుకడంతో రైతులు సంతోషం వ్యక్తంచేశారు.