యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికులం తా కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్కు మద్దతుగా నిలవాలని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్రెడ్డి, ముఖ్య సలహాదా రు బోయపల్లి యాదయ్య పిలుపునిచ్చారు. సోమవారం చండూరులో జరిగిన యూనియన్ సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల వేతన సవరణకు సానుకూలంగా స్పందించారని చెప్పారు. యూనియన్ల పునరుద్ధరణకు స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. చండూరులో బస్ డిపో ఏర్పాటు కూడా హామీ ఇచ్చారని వెల్లడించారు. మునుగోడులో అభివృద్ధి జరుగాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.