హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని అన్ని పోస్టాఫీసుల్లో 9,10వ తేదీల్లో సుకన్య మహా మేళా నిర్వహించాలని తపాలాశాఖ నిర్ణయించింది. 6,208 పోస్టాఫీసుల్లో రెండు రోజుల్లో 30 వేలకు పైగా సుకన్య సమృద్ధి ఖాతాలను తెరువాలని భావిస్తున్నది.
ఆడపిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు, ఖాతా తెరవడంలో సహకరించేందుకు 17,095 మంది సిబ్బందిని సంస్థ సిద్ధం చేసింది.