పొరుగు రాష్ట్రం గొడవ చేయడంవల్లనే మన నీటిపారుదల ప్రాజెక్టులపై కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. అక్టోబర్ 16 నుంచి కేంద్రమే నీటిపారుదల ప్రాజెక్టులను నిర్వహించాలని నిర్ణయించిందని, దాన్ని వాయిదా వేయాలని కోరామని తెలిపారు. ‘రెండుమూడు రోజుల్లో కేంద్రం వైఖరి తెలుస్తుంది. వాయిదా వేస్తే మంచిది, లేకుంటే అఖిలపక్షం ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుద్దాం’ అని చెప్పారు.