కమ్మర్పల్లి, సెప్టెంబర్ 2: బీఆర్ఎస్ పార్టీకి ఊరూరా మద్దతు పెరుగుతున్నది. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకే ఓటేస్తామని అన్ని సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. కామారెడ్డి నియోజకవర్గంలో మొదలైన ఈ పరంపర బాన్సువాడ, బాల్కొండ నియోజకవర్గాలకూ పాకింది. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి మద్దతుగా నిలువాలని నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో మాదిగ సంఘం శనివారం నిర్ణయించింది. సంఘానికి చెందిన 64 కుటుంబాలు సమావేశమై వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని తీర్మానించాయి. కారు గుర్తుకు ఓటేసి, ప్రశాంత్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకొంటామని స్పష్టం చేశారు.