హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): భారత జాగృతి కమిటీలన్నింటినీ రద్దుచేసినట్టు భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం సంస్థ కార్యాలయం ఒక విడుదల చేసింది. భారత జాగృతి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ కమిటీలతోపాటు, విదేశాల్లో ఉన్న కమిటీలన్నింటినీ రద్దు చేశామని, తక్షణమే ఇది అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.