హైదరాబాద్, మే1 (నమస్తే తెలంగాణ): మే డే స్ఫూర్తితో దేశంలో బీజేపీ ఫాసిస్టు పాలనకు చరమగీతం పాడాలని ఆలిండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయిని నరేందర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
కార్మికులను మతాల వారీ గా విభజించి పాలిస్తూ కార్మిక వ్యతిరేక చట్టాలను మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్నదని, ప్ర భుత్వరంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అ మ్ముతూ రిజర్వేషన్లను పరోక్షంగా ఎత్తివేస్తున్నదని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు కాపాడుకోవాలన్నా, కార్మిక వ్యతిరేక చట్టాలను అడ్డుకోవాలన్నా చట్టసభల్లో బడుగు బలహీన వర్గాల మెజార్టీ పెరగాలని, ఆ పోరాటంలో అంద రూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాబో యే ఎన్నికల్లో బీజేపీని ఓడించినప్పుడే దేశం లో ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమని, ప్రజలకు మేలు జరుగుతుందని వెల్లడించారు.