హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) సభ్యకార్యదర్శి డాక్టర్ శ్యామరథ్ గురువారం జేఎన్టీయూలో ఇండోవేషన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సెంటర్ ఏర్పాటుతో స్థానిక పారిశ్రామిక వేత్తలను ప్రపంచ అవకాశాలకు అనుసంధానం చేయడంతోపాటు భారత మార్కెట్కు అనువైన సరసమైన, స్థిరమైన స్వదేశీ ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభిస్తుంది అని వర్సిటీ అధికారులు తెలిపారు.
కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ కిషన్కుమార్, రెక్టార్ ప్రొఫెసర్ విజయ్కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.