హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఎస్టీ వర్గాల్లో చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం (ఏఐబీఎస్ఎస్) కోరింది. ఈ మేరకు బుధవారం డీజీపీని సంఘం సభ్యులు కలిసి వినతిపత్రం సమర్పించారు. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న సోయం బాపురావు సఖ్యతగా ఉన్న ఎస్టీ వర్గాల్లో చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. చట్టాన్ని, న్యాయస్థానాల తీర్పులను అవహేళన చేస్తున్న ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.