హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): నోటిఫికేషన్ ఆధారంగానే గురుకుల పోస్టుల నియామకాలను చేపట్టాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్), గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు మాసాబ్ ట్యాంక్లోని సంక్షేమభవన్ తెలంగాణ గురుకుల నియామక బోర్డు ఎదుట శనివారం భారీ ధర్నా నిర్వహించారు. గురుకుల అభ్యర్థులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర, రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లోని ఖాళీల భర్తీకి గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతోపాటు పరీక్షలను సైతం నిర్వహించిందని, ఫలితాలను వెల్లడించాల్సి ఉన్న దని తెలిపారు.
అయితే కొంతమంది నియామక బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు. నోటిఫికేషన్కు విరుద్ధంగా పోస్టులను భర్తీ చేయాలని యోచిస్తున్నారని, తద్వారా మహిళా అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే అవకాముందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ ప్రకారమే రిక్రూట్మెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. సత్వరమే కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థుల సమస్యలపై ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని, అభ్యర్థుల సమస్యలను పరిషరించాలని ఏఐవైఎఫ్ నేతలు, గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అభ్యర్థులకు న్యాయం చేయడానికి కృషి చేస్తామని నియామక బోర్డు అధికారులు నర్సింగ్రావు, షౌకత్అలీ ఖాన్ హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యప్రసాద్, ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా వరింగ్ ప్రెసిడెంట్ షేక్ మహమూద్, గురుకుల అభ్యర్థులు అస్మా, ప్రియాంక, జ్యోష్ణ, జ్యోతి, సుజాత, విజయ, మంగమ్మ, అమృత, కవిత, మమతతో పాటు 50 మంది పాల్గొన్నారు.
నోటిఫికేషన్ ఆధారంగానే అభ్యర్థుల నియామకాలు చేపట్టి అభ్యర్థులకు న్యాయం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) హైదరాబాద్ జిల్లా కార్యదర్శి జావిద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్షలను నిర్వహించినా ఫలితాలు వెల్లడించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఫలితంగా గురుకుల అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సత్వరమే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రకటనలో హెచ్చరించారు.