కరీంనగర్ కలెక్టరేట్, మే 25: ఎంసెట్-2023 ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ విద్యాసంస్థ హవా కొనసాగించింది. రాష్ట్రస్థాయిలో మూడంకెల సంఖ్యలో పలు ర్యాంకులు సాధించి ఉత్తర తెలంగాణలో మరోసారి తన సత్తా చాటింది. అల్ఫోర్స్ యాజమాన్యం విద్యార్థులకు అందించిన తర్ఫీదుతో వెయ్యిలోపు 14 మంది, 5 వేల లోపు 118 మంది ర్యాంకులు పొంది తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చబోతున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో ఎం అభిరామ్ 301వ ర్యాంకు సాధించి అత్యున్నత స్థానంలో నిలిచాడు. ఏ ఇషాంత్రెడ్డి 322, జీ జ్యోతి 374 ర్యాంకులు పొంది కాలేజీలో రెండు, మూడో స్థానాలు సంపాదించారు. అగ్రికల్చర్ విభాగంలో బీ శ్రీగోధ 356, టీ దీపిక 446 ర్యాంకులు సాధించారు. ఎం చిన్మయ్ 542, బీ శ్రీనివాస్ 650, ఎస్ సాయిసధిష్ఠ 681, కే ప్రణితారెడ్డి 752, హస్వితారెడ్డి 818, బీ విద్యాలక్ష్మి 821, ఎస్ ధీరజ్కుమార్ 833, ఎన్ మనస్విని 865, ఆర్ సుహాసిత 893వ ర్యాంకులు పొందారు.
40 మందికి 2 వేలలోపు ర్యాంకులు
40 మంది విద్యార్థులు 2 వేలలోపు, 63 మంది 3 వేలలోపు, 118 మంది 5 వేలలోపు ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ కీర్తి ప్రతిష్ఠలను దశదిశలా చా టారు. తకువ మంది విద్యార్థులతో అత్యధిక, అత్యద్భుత ర్యాంకులు సాధించడం అల్ఫోర్స్ విద్యార్థులకు మాత్రమే సాధ్యమని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లోనూ 450 మంది విద్యార్థులు అడ్వాన్స్కు అర్హత పొందడం అల్ఫోర్స్ ఉత్తమ విద్యా బోధనకు నిదర్శనంగా నిలిచారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణతో ఘన విజయాలు సాధిస్తున్నామని విద్యార్థుల అభినందన సభలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్రెడ్డి చెప్పారు. నీట్ ఫలితాల్లో కూడా అల్ఫోర్స్ ఉత్తమ ర్యాంకులతో ముందంజలో ఉంటుందని విశ్యాసం వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన అనంతరం సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలు రాసి ఐఏఎస్ అధికారిని అవుతానని ఎంసెట్లో 301 ర్యాంకు సాధించిన ఎం అభిరామ్ తెలిపారు. యాజమాన్య పర్యవేక్షణలో నిత్యం 14 గంటలు కష్టపడి చదివానని పేర్కొన్నారు. సాప్ట్వేర్ ఇంజినీర్ కావాలనేది తన ఆకాంక్ష అని 322వ ర్యాంకర్ ఏ ఇషాంత్రెడ్డి తెలిపారు. అగ్రికల్చర్ బీఎస్సీ, ఎమ్మెస్సీ తర్వాత ఆధునిక వ్యవసాయంపై పరిశోధనలు చేసి, రైతాంగానికి మేలు చేకూర్చేందుకు కృషి చేస్తానని 356వ ర్యాంకర్ బీ శ్రీగోధ తెలిపారు.