కమాన్చౌరస్తా, మే 17 : ఎప్సెట్-2026 ఫలితాల్లో ‘అల్ఫోర్స్’ విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపినట్టు ఆ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. కరీంనగర్లోని వావిలాలపల్లిలో ఆదివారం ఏర్పాటుచేసిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కళాశాలకు చెందిన డీ రిత్విక్(అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో) రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంక్, పీ చరణ్(ఇంజినీరింగ్ విభాగంలో)22వ ర్యాంక్ సాధించినట్టు చెప్పారు. 32 మంది విద్యార్థులు వెయ్యిలోపు ర్యాంక్లు సాధించడం సంతోషకరమని తెలిపారు. 57 మంది విద్యార్థులు 2వేల లోపు, 88 మంది 3వేల లోపు, 127 మంది 4వేల లోపు, 169 మంది విద్యార్థులు 5వేల లోపు ర్యాంక్లు సాధించి ఆల్ఫోర్ కీర్తిని దశదిశలా చాటారని ఆనందం వ్యక్తంచేశారు. పటిష్ట ప్రణాళిక, విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల కృషితోనే ఇంతటి ఘన విజయాలు సాధిస్తున్నామని స్పష్టంచేశారు. ఉత్తమ ర్యాంక్లు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు.