నిజామాబాద్ : ఎగువన మహారాష్ట్ర (Maharashtra) తో పాటు నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (Sri Ram Sagar Project) నిండుతుండడంతో ప్రాజెక్ట్ గేట్లను ఎత్తడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. అతిభారీ వర్ష సూచన కారణంగా ఏక్షణం లోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి నీటిని వదిలే అవకాశం ఉందని ప్రాజెక్ట్ డ్యాం సైట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెల్లడించారు.
రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పరివాహక గ్రామాలలో దండోరా వేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నదీ పరీవాహక ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు, మత్స్య కార్మికులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రకటించారు.