హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) : ఉన్నత చదువులు చదివిన లక్షలాది మంది యువతకు ఉద్యోగాల కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ ఆరోపించారు. ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో యువజన సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ మాట్లాడుతూ.. యువతను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. దేశం లో నిరుద్యోగ సంక్షోభం ప్రమాదకరస్థాయికి చేరిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు శ్రీమాన్, బాలకృష్ణ, అనిల్కుమార్, శ్రీనివాస్, దశరథ్నాయక్, భగత్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ ఉద్యోగ సంఘాన్ని గుర్తించండి ; టీబీసీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్గౌడ్ డిమాండ్
హైదరాబాద్, మే3 (నమస్తే తెలంగాణ): బీసీ ఉద్యోగుల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి, సమస్యల పరిషారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తెలంగాణ బీసీ ఉద్యోగ సంఘం(టీబీసీయూఎస్)ను ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముకురాల చంద్రశేఖర్గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.