హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) రద్దుకు ఉద్యమిద్దామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఎన్ఈపీ ద్వారా విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణకు కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్ర చేస్తున్నదని విమర్శించారు. హిమాయత్నగర్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఈనెల 25న జరిగే పార్లమెం ట్ మార్చ్ కరపత్రాన్ని సోమవారం విడుదల చేశారు. భగత్సింగ్, అంబేదర్, పెరియార్, నారాయణగురు వంటి వారి జీవిత చరిత్రలను పాఠ్యాంశాల నుంచి తొలగించి, బ్రిటిష్వారికి తొత్తుగా వ్యవహరించిన సావరర్ జీవిత చరిత్రను చేర్చి చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. బాల్యం నుంచే విద్యార్థుల మెదడులో మతతత్వ భావజాలాన్ని నింపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.