హైదరాబాద్,ఎప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : కొత్తగా సెట్, నెట్ అర్హత సాధించిన అభ్యర్థులకు గురుకుల డిగ్రీ లెక్చరర్ల పోస్టులకు అవకాశం కల్పించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నేతలు శుక్రవారం గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ మల్లయ్య భట్టును కలిసి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, సహాయ కార్యదర్శి గ్యార నరేశ్, నేతలు ఉదయ్, రఘు, అభ్యర్థులు వీరస్వామి, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.