హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఏషియా (AirAsia) విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఎయిర్ ఏషియాకు చెందిన విమానం కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్నది. ఈ క్రమంలో గాలిలో ఉండగానే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అప్రమత్తమైన పైలట్ శంషాబాద్ ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ఎయిర్పోర్టు అధికారులు అనుమతించారు. విమానాన్ని పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో 73 మంది ప్రయాణికులు ఉన్నారని, అంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు వెల్లడించారు. కాగా, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రకటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.