హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐఎంఐఎం పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించింది. ఆ స్థానం నుంచి మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్(Rashed Farazuddin) పోటీలో ఉండనున్నట్లు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ ప్రకటించారు. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పోటీలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పోటీలో ఉన్నారు. దీంతో ఈ స్థానంలో పోటీ ప్రతిష్టాకంగా మారనున్నది.
Mohammed Rashed Farazuddin @MohdRashedFaraz AIMIM Shaikhpet corporator will be our MLA candidate from Jubilee Hills constituency.
— Asaduddin Owaisi (@asadowaisi) November 6, 2023
షేక్పేట కార్పొరేటర్గా ఉన్న రషీద్ ఫరాజుద్దీన్కు ఈసారి ఎంఐఎం పార్టీ జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వడం గమనార్హం. హైదరాబాద్ నుంచి మొత్తం 9 స్థానాల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తున్నది. ఇవాళ ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్.. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. చార్మినార్ వద్ద ఇవాళ ఆయన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.