హైదరాబాద్, మే 3: ప్రముఖ సినీనటుడు శరత్ బాబు ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను ఏఐజీ ఆసుపత్రి ఖండించింది. ఆయన మరణించారని వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని పేర్కొంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, ఇంటెన్సివ్ కేర్లో చికిత్స జరుగుతోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
వివిధ విభాగాలలో నిపుణులైన వైద్య బృందం శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు విడుదల చేసిన బులెటిన్లో ఆసుపత్రి ఆకాంక్షించింది.