హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి మరింత బలపడినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. వాయువ్య దిశగా కదులుతూ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు తీరానికి దగ్గరగా వస్తూ మరింత బలపడి ఈ నెల 8న ఉదయానికి తుఫానుగా మారే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
అనంతరం తుఫాను తీవ్ర ప్రభావం చూపవచ్చని పేర్కొన్నది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పొడివాతావరణం ఉంటున్నదని, ఆగ్నేయ, తూర్పు ప్రాంతాల నుంచి వీచే గాలులతో చలి తీవ్రత పెరుగుతుందని తెలిపింది. ఈ నెల 8న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చిరుజల్లులు కురువొచ్చని పేర్కొన్నది.