సుల్తాన్బజార్, మార్చి 18: ప్రభుత్వ యాజమాన్యంలోని మౌలిక సదుపాయాల ఆస్తులను అమ్మడం ద్వారా దాదాపు రూ.6 లక్షల కోట్లు సమీకరించుకొనేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘నేషనల్ మానిటైజేష న్ పైప్లైన్’ పథకంతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దె బ్బతింటుందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) జాతీయ కార్యదర్శి బీఎస్ రాం బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ‘నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్.. శ్రామికవర్గం’ అనే పేరుతో ఏఐటీయూ సీ జాతీయ సమితి రూపొందించిన పుస్తకాన్ని శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. కోఠి బ్యాంక్స్ట్రీట్లో ని ఏపీ, టీఎస్ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాంబాబు మాట్లాడుతూ.. ప్రజల సంపదను అప్పనంగా కార్పొరేట్ కుబేరులకు కట్టబెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్’ పథకాన్ని ప్రవేశపెట్టిందని విమర్శించారు. విశాఖ స్టీల్ప్లాంట్ సహా లాభాల్లో ఉన్న బ్యాంకులు, ఇన్సూరెన్స్, మైనింగ్ ఏవియేషన్, ఓడరేవులు, రైల్వేలు, విద్యుత్తు రంగాల్లోని ప్రభుత్వ సంస్థలను, సహజ వాయువు, పెట్రోలియం పైప్లైన్ల లాంటి ప్రభుత్వ మౌలిక సదుపాయాల ఆస్తులను నరేంద్రమోదీ ప్రభుత్వం బహుళజాతి కంపెనీలకు అ మ్ముకొంటూ శ్రామిక ప్రజల ప్రజాస్వామ్య హక్కుల ను నిర్వీర్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేం ద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో జరుగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసేందుకు కృషిచేస్తామని చెప్పారు. పెద్దనోట్ల రద్దుతో దేశానికి జరిగిన మేలేమీ లేదని ఏఐటీయూసీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ విమర్శించారు. దేశంలోని శ్రామికవర్గ ప్రజల హక్కులను కాలరాసి కార్పొరేట్ గుత్తాధిపత్యాన్ని సృష్టించేందుకే కేంద్రం ‘నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్’ పథకాన్ని ప్రవేశపెట్టిందని ధ్వజమెత్తారు.