హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెస్టర్న్-సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న డ్యూయల్ డిగ్రీ బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కోసం ఈనెల 13న వాక్-ఇన్-కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జీఈ సీహెచ్ విద్యాసాగర్ తెలిపారు.
గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్ఆర్ఐ కోటా బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీటెక్(అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీఎస్సీ(ఆనర్స్), కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో సీట్ల భర్తీకి వాక్-ఇన్-కౌన్సెలింగ్ నిర్వహిస్తామని రిజిస్ట్రార్ పేరొన్నారు. వివరాలకు వెబ్సైట్ www.pjtau.edu.inలో చూడవచ్చని రిజిస్ట్రార్ తెలిపారు.