హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ పాలన ఈ తరానికి వరం, భవిష్యత్తు తరాలకు వారధి అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన అక్కడి టీఆర్ఎస్ విభాగం నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్లో పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్వన్గా నిలిపిన దార్శనికుడు సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో విక్టోరియా ఇన్చార్జి సాయిరాం ఉప్పు, విశ్వామిత్ర, సతీశ్, వినయ్ సన్నీ, ప్రవీణ్ లేదెళ్ల, విక్రమ్ కందుల, ఉదయ్, సాయియాదవ్, వేణు నాన, రాకేశ్, సాయిగుప్తా, సందీప్నాయక్ పాల్గొన్నారు.