టీఆర్ఎస్ నాయకుడు, వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు వాసి మనిగిల్ల నాగిరెడ్డి మృతిపట్ల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సంతాపం తెలిపారు. మంగళవారం ఆయన నాగిరెడ్డి భౌతికకాయం వద్ద
నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని ఆయన పాడె మోశారు. తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి నడిచిన నాగిరెడ్డి మృతి పార్టీకి తీరని లోటు అన్నారు.
– పెద్దమందడి