హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : మరో జాతీయ స్థాయి సమావేశానికి హైదరాబాద్ వేదిక కానున్నది. శుక్రవారం నుంచి అక్టోబర్ 2 వరకు రంగారెడ్డి జిల్లా కన్హ శాంతి వనంలో ఐకార్ ఆధ్వర్యంలో దేశంలోని వ్యవసాయ, అనుబంధ రంగాల యూనివర్సిటీల ఉపకు లపతుల (వీసీ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి 55 అగ్రికల్చర్, ఉద్యాన, వెటర్నరీ, ఫిషరీస్ యూనివర్సిటీల వీసీలు హాజరుకానున్నారు.
సమావేశంలో ప్రధానంగా విశ్వవిద్యాలయాల్లో రెవెన్యూ జనరేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్, వ్యవసాయ విద్య ప్రపంచీకరణ, వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లకు సంయుక్త పరీక్షల నిర్వహణ, డిగ్రీ స్థాయిలో యోగా, మెడిటేష న్తోపాటు ఫౌండేషన్ కోర్సులు ప్రవేశపెట్టడం, ఆరో డీన్స్ కమిటీ, సహజ వ్యవసాయంపై సిఫారసులు, గ్లోబల్ ర్యాంకింగ్ కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయాల వ్యవస్థలో అంతరాల విశ్లేషణ, రానున్న 20 ఏండ్లలో వ్యవసాయ రంగంలో మానవ వనరుల అవసరాలపై పరిశోధనలతోపాటు ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం అవకాశాలు అనే అంశాలపై చర్చించనున్నట్టు ఐకార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్సీ అగర్వాల్, తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ వీసీ బీ నీరజ ప్రభాకర్ తెలిపారు.