మహబూబూబ్నగర్ : బొక్కల ఫ్యాక్టరీ(Bones factory)తో నుంచి వెలువడే దుర్గంధంతో తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఆరోపిస్తూ స్థానికులు కంపెనీ ముందు ఆందోళనకు(Agitation) దిగారు. ఈ సంఘటన జిల్లాలోని తాటికొండ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. తాటికొండ శివారు నేషనల్ హైవే దగ్గర్లో ఉన్న బొక్కల ఫ్యాక్టరీ నుంచి పశువుల కళేబరాలతో ఆయిల్ తీస్తుంటారు.
ఈ క్రమంలో కంపెనీ నుంచి వెలువడే కలుషితమైన గాలిని పీల్చడం వల్ల గాజులపేట(Gajulapeta) గ్రామ ప్రజలకు శ్వాస కోసం వ్యాధులు వస్తున్నాయని గాజులపేట యువకులు ఆ కంపెనీ వద్ద నిరసనకు దిగారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆ సమయంలోనే కంపెనీలోకి తీసుకు వస్తున్న జంతు కళేబరాల వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై కళేబరాలు పడిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.